న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నామని భారత్ గురువారం పేర్కొంది. గత 60 ఏండ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం జరుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది.
ఈ వ్యవహారంలో మన భద్రతా ప్రయోజనాలను కాపాడే రీతిలో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎంఈఏ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు. చైనా ఇలాంటి చర్యలు చేపట్టే బదులు భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఎల్ఏసీ వద్ద ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతాల్లో తమతో నిర్మాణాత్మక సంప్రదింపుల ద్వారా సామరస్య పరిష్కారానికి డ్రాగన్ చొరవ చూపాలని సూచించారు.
మరోవైపు చైనా సరిహద్దుల్లో ప్యాంగాంగ్ సరస్సుపై డ్రాగన్ వంతెన నిర్మిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చారని విపక్షాలు మోదీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. డ్రాగన్ రెచ్చిపోతుంటే ప్రధాని ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.