న్యూఢిల్లీ, జూలై 18: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని పవిత్ర బద్రీనాథ్ ధామ్లో విరాళాల అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) తన దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) మాజీ అధికారి, విరాళాల లెక్కింపు మాజీ ఇన్చార్జి రాజేంద్ర సింగ్ చౌహాన్ను సిట్ అరెస్ట్ చేసింది. జోషిమఠ్లోని న్యాయస్థానం ముందు శనివారం అతడిని హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
ఆలయ సీసీ ఫుటేజ్లు పరిశీలించిన దర్యాప్తు బృందానికి విరాళాల నిర్వహణ వ్యవస్థపై పలు సందేహాలు తలెత్తాయి. లభ్యమైన 13 రోజల ఫుటేజ్ను సిట్ పరిశీలించగా ప్రతి రోజు కట్టల కట్టల కరెన్సీ, బంగారం, వెండిని కొందరు అపహరిస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ఇంకా 32 రోజుల సీసీటీవీ ఫుటేజ్ అదృశ్యమైనట్టు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితుని వద్ద నుంచి కుంకుమ పువ్వు, ఇతర వస్తువులు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణానికి బదులు బ్యాంక్ ప్రాంగణంలో విరాళాలను లెక్కించారన్న ఆరోపణలపై కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నది. దీనిలో బ్యాంక్ అధికారుల పాత్ర గురించి ఆరా తీస్తున్నది.