న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్లోని హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో భూమి కంపించింది. తుర్కిమెనిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, అప్ఘనిస్థాన్, కిర్గిజిస్థాన్లలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో ఇండ్లు, భవనాలు కదిలాయని ప్రజలు తెలిపారు.