ఔరంగాబాద్, సెప్టెంబర్ 14: మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గత 17 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ కోటా ఉద్యమ నేత మనోజ్ జరాంగే గురువారం తన ఆందోళన విరమించారు.
మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్నాథ్ షిండే, అతని మంత్రివర్గ సహచరులు కొందరు ఉదయం జాల్నా జిల్లా ఆంత్రవల్లి శారతి గ్రామానికి వెళ్లి గత నెల 29 నుంచి దీక్ష చేస్తున్న మనోజ్ను కలిశారు. గతంలోనే తాము మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించినా దానిని సుప్రీం కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మనోజ్కు జ్యూస్ ఇచ్చి దీక్ష విరమింపచేశారు.