రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ సర్పంచ్ను చంపేశారు. బీజాపూర్ జిల్లాలోని మోర్మెడ్ గ్రామ సర్పంచ్ పతిరామ్ కుడియం ను రెండు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆయనను మారణాయుధాలతో కొట్టి చంపారు. అనంతరం అతడి మృతదేహాన్ని అడవిలో వదిలివెళ్లారు. దీంతో మృతుని ఇంట్లో తీవ్ర విషాదం అలముకున్నది. మోర్మెడ్ గ్రామానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.