రాంచీ : జార్ఖండ్లోని గిరిధ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కుఖ్రా పోలీసు స్టేషన్ పరిధిలో ఎయిర్టెల్ టవర్కు నిప్పు పెట్టారు. ఇద్దరు మావోయిస్టులు బైక్పై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మధుబన్ వద్ద ఐడియా టవర్ను బాంబులతో పేల్చేశారు.
ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ రెండు ప్రాంతాల్లో పోలీసులు మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్, ఆయన భార్య షీలా మారండి అరెస్టులకు నిరసనగా మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. వీరిద్దరిని గతేడాది నవంబర్ నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ బోస్ పై రూ. కోటి రివార్డు ఉంది.