హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ఘటనపై దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా నాయకత్వంలో భారీ దాడులకు పథకం రచించారన్నారు. 2 వేల మంది పోలీసులు భారీస్థాయిలో తమపై దాడికి వచ్చినట్లు తెలిపారు. ఐదు రాష్ర్టాల పోలీసు అధికారులతో దాడికి పథకం వేశారన్నారు. పోలీసుల దాడికి తాము ప్రతిదాడి చేసినట్లు చెప్పారు. ప్రతిఘటనలో 23 మంది పోలీసులు చనిపోగా పోలీసుల దాడిలో తమ సభ్యులు నలుగురు మృతిచెందారన్నారు.
ఓ పోలీసు తమకు బందీగా దొరికినట్లు వెల్లడించారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీగా ఉన్న పోలీసుని అప్పగించనున్నట్లు ప్రకటించారు. పేర్లు ప్రకటించే వరకు పోలీసు తమ వద్ద క్షేమంగా ఉంటారన్నారు. పోలీసులు తమకు శత్రువులు కాదన్నారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. చర్చలకు తామెప్పుడు సిద్ధమేనని.. ప్రభుత్వానికే చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు.