న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ముఖ్య నాయకుడు ఒకరు హతమయ్యాడు. బోడ్గుబ్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని..ఈ ఘటనలో మావోయిస్టు కీలక నేతను మట్టుబెట్టామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మావోయిస్టు హింసకు సంబంధించి పదుల సంఖ్యలో ఇతడిపై కేసులు నమోదై ఉన్నాయని, ఇతడి పేరును ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.