న్యూఢిల్లీ : చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సీమా సిసోడియా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కోర్టు అనుమతితో సిసోడియా భార్యను కలిసి మాట్లాడారు. దీనిపై ఆమె ట్వీట్ చేస్టూ ‘103 రోజుల తర్వాత నా భర్తను కలుసుకుని మాట్లాడాను. పోలీసులు మా బెడ్ రూం బయటే ఉండి మా సంభాషణ అంతా ఆలకించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఏడు గంటల పాటు మేము మాట్లాడుకున్న ప్రతి మాటను వినడానికి ఎంతో కష్టపడ్డారు’ అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్కు అఖిలేశ్ మద్దతు
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ను బుధవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కలిశారు. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని వారు అఖిలేశ్ను కోరారు. అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభు త్వం చేస్తున్న మంచి పనులను బీజేపీ జీర్ణించుకోలేకనే ఆటంకాలు కలిగించాలని చూస్తున్నదని అన్నా రు. రాజ్యసభలో ఆప్కు మద్దతుగా ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తామని ప్రకటించారు. గవర్నర్లను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యంతో కేంద్రం ఆటలాడుతుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు.