న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతున్నది. కొత్త వేరియంట్ వ్యాపిస్తుండటంతో జనం మళ్లీ అలెర్ట్ అయ్యారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు (COVID Protection) తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పాత వీడియో క్లిప్ తిరిగి వైరల్ అయ్యింది. ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరించాడు.
కాగా, ఆ మెట్రో రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డు చేశాడు. ఒక యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘షాప్ కీపర్: క్యారీ బ్యాగ్ కా ఎక్స్ట్రా 5 లగేగా’ అని శీర్షిక పెట్టాడు. అయితే 2021 సెప్టెంబర్ 25న పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్, సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మరోసారి ఈ వీడియో క్లిప్పై స్పందించారు. కొందరు తమదైన స్టైల్లో కామెంట్లు చేశారు.
Shopkeeper: Carry bag ka extra 5 lagega
Me: pic.twitter.com/nhSH04vNks— Godman Chikna (@Madan_Chikna) September 25, 2021