బెంగళూరు: ఒక మహిళ తన స్కూటీ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి ఆగ్రహించాడు. ఆ మహిళతోపాటు ఆమె తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (Man Sets Partner on Fire) ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. నందిని లేఅవుట్ ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల పాండురంగకు ఇన్స్టాగ్రామ్లో 27 ఏళ్ల సుమలత పరిచయమైంది. పెళ్లై ఇద్దరు కుమారులున్న ఆమె తన భర్తను వదిలేసింది. దీంతో పాండురంగ, సుమలత కలిసి ఏడాది పాటు సహజీవనం చేశారు. వారికి కుమార్తె పుట్టింది. అయితే గొడవల వల్ల వారిద్దరూ విడిపోయారు.
కాగా, ఇంటి పనులు చేస్తున్న సుమలత తన తల్లిదండ్రులతో కలిసి తారబనహళ్లి ప్రాంతంలో నివసిస్తున్నది. మార్చి 6న సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమలత ఇంటికి పాండురంగ చేరుకున్నాడు. ఆమె స్కూటీ తాళం ఇవ్వమని అడిగాడు. సుమలత నిరాకరించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సుమలత తల్లిదండ్రులు జ్యోకం చేసుకున్నారు.
మరోవైపు ఆగ్రహించిన పాండురంగ బాటిల్లో తెచ్చిన పెట్రోల్ను సుమలత, ఆమె తల్లిదండ్రులపై పోసి నిప్పంటించి పారిపోయాడు. కాలిన గాయాలైన ఆ ముగ్గురిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన పాండురంగను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
man stabs twin sister | ఇన్స్టాగ్రామ్ యువతితో బ్రేకప్.. కవల సోదరి, తల్లిపై కత్తితో వ్యక్తి దాడి
IndiGo flight U-turn | ఇథియోపియా సరిహద్దు దగ్గర ఇండిగో విమానం యూ టర్న్.. ఢిల్లీలో ల్యాండ్
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?