Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్( Parliament ) సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పంటించుకున్నబాధిత వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో.. ఈ దేశాన్ని కాపాడండి అంటూ.. మోదీ( Modi )కి వ్యతిరేకంగా అతను నినదించాడు. బాధిత వ్యక్తిని రోహిణికి చెందిన రాజ్కుమార్ శర్మగా పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ సమీపంలో రాజ్ కుమార్ శర్మ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి మద్దతుగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.