న్యూఢిల్లీ : మన చుట్టూ దయాగుణం కలిగిన వారు కొందరైనా ఉండటం వల్లే ప్రపంచం ఇంకా నివసించేందుకు అనుకూలంగా ఉంది. మన జీవితాల్లో ఇలాంటి మనుషుల అవసరం ఇప్పుడు చాలా ఉంది. విద్యుత్ స్తంభంపై ఇరుక్కున్న పావురాన్ని ఓ వ్యక్తి రక్షించి దానికి నీరు తాగించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను హాస్య ది పిటారి అనే ఇన్స్టాగ్రాం పేజ్ షేర్ చేసింది. ఈ వైరల్ క్లిప్లో ఎలక్ట్రిక్ స్తంభంపై చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు ఓ వ్యక్తి పోల్ ఎక్కడం కనిపిస్తుంది. పక్షికి గాలిపటం దారం చిక్కుకుపోగా ఆ వ్యక్తి దారాన్ని కత్తిరించి పావురాన్ని కాపాడతాడు.
పక్షికి మంచినీరు అందించి దాని దాహాన్ని తీరుస్తాడు. ఈ ఘటన మానవత్వం ఇంకా బతికేవుందని చాటి చెప్పేలా ఉంది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 21,000 మందికిపైగా వీక్షించారు. ఆ వ్యక్తి దయాగుణాన్ని ఇన్స్టాగ్రాం యూజర్లు ప్రశంసలతో ముంచెత్తారు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా దేవుడు ఇతడ్ని ఎల్లవేళలా కాపాడతాడని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :