కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. తన 16 ఏండ్ల కూతురు ప్రియుడితో రాసలీలలు జరుపుతున్నదని తెలిసి ఆమె తండ్రి ఇద్దరినీ అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా ఘటంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘటంపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) తన కుటుంబంతో కలిసి ఉంటున్నది. శుక్రవారం పొరుగూరిలో బంధువుల పెండ్లి ఉండటంతో బాలికను ఒక్కదాన్ని ఇంట్లో ఉంచి అందరూ అక్కడికి వెళ్లారు. తల్లిదండ్రులు ఊరికి వెళ్లగానే బాలిక అదే గ్రామానికి చెందిన 15 ఏండ్ల బాలుడిని తన ఇంటికి పిలిపించుకున్నది.
ఇంట్లో ఇద్దరూ రాసలీలలు జరుపుతూ బాలిక బాబాయ్ (పినతండ్రి) కంటబడ్డారు. ఆయన ఇద్దరినీ ఇంట్లోనే బంధించి బయటి నుంచి తాళం వేశాడు. అనంతరం వివాహ వేడుకలో ఉన్న తన సోదరుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దాంతో శుక్రవారం రాత్రి కోపంతో గ్రామానికి చేరుకున్న బాలిక తండ్రి.. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని ఇద్దరి తలలను తెగ నరికాడు.
గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడు హత్య కోసం వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడు వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.