న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మహిళను ఈడ్చుకొచ్చి, కొట్టి క్యాబ్లోకి నెట్టాడు. స్థానికులు తమ మొబైల్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మంగోల్పురి ఫ్లై ఓవర్ వద్ద మహిళను ఒక వ్యక్తి ఈడ్చుకొచ్చాడు. ఆమెను బలవంతంగా ప్రైవేట్ క్యాబ్లోకి తోసి పిడిగుద్దులు కురిపించాడు. మరో వ్యక్తి కూడా ఆ కారు వద్ద ఉన్నాడు. అనంతరం వారు అక్కడి నుంచి ఆ కారులో వెళ్లిపోయారు.
కాగా, స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు ఈ వీడియో క్లిప్ను ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేసి అలెర్ట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎల్లో నంబర్ ప్లేట్ ఉన్న ఆ ప్రైవేట్ క్యాబ్ హర్యానాలోని గురుగ్రామ్లో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. ఆ కారు డ్రైవర్ను గుర్తించి అతడి నుంచి వివరాలు సేకరించారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి రోహిణి నుంచి వికాస్పురి ప్రాంతానికి ఉబర్ ద్వారా క్యాబ్ బుక్ చేసినట్లు తెలుసుకున్నారు.
మార్గమధ్యలో అమ్మాయి, అబ్బాయిల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగిందని డీసీపీ హరేందర్ కుమార్ సింగ్ తెలిపారు. దీంతో ఆ మహిళ కారు దిగగా వెంట ఉన్న వ్యక్తి బలవంతంగా ఆమెను కారులోకి తోసి కొట్టినట్లు తెలిసిందన్నారు. ఈ వీడియో క్లిప్ తమ దృష్టికి వచ్చిందని, దీనిని తాము చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పారు. ఆ మహిళ, ఇద్దరు వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
#SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v
— Office of Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023
Also Read: