ఏడాది తర్వాత ప్రభుత్వం నిర్ణయం
పారిస్, జూన్ 17: కరోనా కేసులు తగ్గుతుండటం, టీకాలు వేసే కార్యక్రమం పుంజుకోవడంతో ఈ నెల 20 నుంచి రాత్రికర్ఫ్యూను సడలించాలని ఫ్రాన్స్ నిర్ణయించింది. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్లో ఇకపై మాస్కు ధరించడం కూడా తప్పనిసరి కాదని గురువారం ప్రకటించింది. ఫ్రాన్స్లో రాత్రికర్ఫ్యూతోపాటు బయటికొస్తే మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన కూడా గత ఏడాది నుంచి అమలులో ఉన్నది. మొదట్లో సాయంత్రం 6 గంటల నుంచే కర్ఫ్యూ మొదలయ్యేది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి మొదలవుతున్నది.