కోల్కతా : జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని ఉండటం వివాదం కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్గా మారుస్తారనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి స్పందించారు. దేశంలో చరిత్రను తిరగరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మనం ఇండియాను భారత్ అనే పిలవాలనేంతగా ఒక్కసారిగా ఏం మార్పులు చోటుచేసుకున్నాయని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈరోజు కేంద్ర పాలకులు ఇండియా పేరు మార్చేశారు. జీ20 సదస్సు ఆహ్వాన పత్రంలో భారత్ అని రాశారని, ఆంగ్లంలో మనం ఇండియా అంటామని, ఇండియా రాజ్యాంగమని పేర్కొంటామని దీదీ గుర్తు చేశారు. హిందీలో భారత్ కా సంవిధాన్ అంటామని, మనమందరం భారత్ అంటామని అందులో కొత్త విషయం ఏముందని కూడా ఆమె చెప్పుకొచ్చారు.
అయితే ఇండియా పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమని, అసలు ఇప్పటికిప్పుడు దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏంటని మమతా బెనర్జీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు పంపిన అధికారిక ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఈ లేఖను ట్వీట్ చేస్తూ ఈ వార్త నిజం కావచ్చని రాసుకొచ్చారు. జీ20 డిన్నర్కు సంబంధించి రాష్ట్రపతి ప్రతినిధులకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రస్తావించారు. ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరించడం కొనసాగిస్తున్నారని, ఇండియాను విభజిస్తున్నారని మరో ట్వీట్లో జైరాం రమేష్ మండిపడ్డారు.
Read More :
Shah Rukh khan | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్