తిరుమల: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ (Shah Rukh khan) తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న షారూఖ్.. శ్రీవారి సుప్రభాత సేవలో (Suprabhatha sewa) పాల్గొన్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు టీటీడీ అధికారులు షారుఖ్ ఖాన్కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
షారుఖ్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ (Jawan) చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే విడుదలై గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్లు మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. గతనెల 31న విడుదలై ఈ సినమా ట్రైలర్కు బీభత్సమైన స్పందన వచ్చింది. ఇందులో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో అలరించనున్నాడని అర్థమవుతున్నది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్తోపాటు బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె, లేడి సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, దంగల్ భామ సాన్య మల్హోత్రా, యోగిబాబు, అసుర్ సిరీస్ ఫేమ్ రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
#WATCH | Andhra Pradesh: Actor Shah Rukh Khan, his daughter Suhana Khan and actress Nayanthara offered prayers at Sri Venkateshwara Swamy in Tirupati pic.twitter.com/KuN34HPfiv
— ANI (@ANI) September 5, 2023
The last time he went #VaishnoDevi temple he gave a blockbuster movie #Pathaan and now once again he is going. जय माता दी 🙏🙏#ShahRukhKhan #JawanPreReleaseEvent #Jawan #NotRamaiyaVastvaiya pic.twitter.com/CApaZ7Z8cH
— Jawan (@SonuK57) August 30, 2023