Mamata Banerjee : కోల్కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College) హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య (Doctor Rape Murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. ఇక ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైద్యురాలి హత్యాచార కేసులో దర్యాప్తు ప్రారంభమైందని, నిందితుడిని సత్వరమే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆదివారం లోగా పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కితీసుకురాకుంటే కేసును సీబీఐకి అప్పగిస్తామని దీదీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై తనకు కోల్కతా పోలీస్ కమిషనర్ సమాచారం అందించగానే విచారకర ఘటన అని చెప్పానని పేర్కొన్నారు. ఆస్పత్రిలో నర్సులు, సెక్యూరిటీ ఉండే క్రమంలో ఈ ఘటన ఎలా జరిగిందనేది తనకు అర్ధం కావడం లేదని ఆమె అన్నారు.
ఆస్పత్రిలో ఉన్న ఓ వ్యక్తి పనే ఇదని పోలీసులు తనతో చెప్పారని ఆమె వివరించారు. ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపల్ ఈరోజు రాజీనామా చేశారని, నిందితుడిని పట్టుకుననేందుకు పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ విభాగం, ఇతర బృందాలు పనిచేస్తున్నాయని మమతా బెనర్జీ తెలిపారు. కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Read More :