Mamata Banerjee : లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరి పోరుకు సిద్ధమన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్పై మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం 40 స్ధానాలు కూడా దక్కడం అనుమానమేనని అన్నారు. కాంగ్రెస్పై దీదీ విమర్శలతో విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు మరింత ముదిరేలా ఉన్నాయి.
బెంగాల్లోని ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. 300 సీట్లలో మీరు (కాంగ్రెస్) కనీసం 40 స్ధానాలైనా గెలుస్తారనేది అనుమానమే..అలాంటిది మీకెందుకింత అహంకారమని దీదీ నిలదీశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్లో అడుగుపెట్టినా తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ యూపీ, రాజస్ధాన్లో గెలిచే పరిస్ధితి లేదని, అలహాబాద్, వారణాసిలో గెలిచి మీ పార్టీ సత్తా చాటాలని ఆమె కాంగ్రెస్కు సవాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికులతో ఫొటో దిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లని వారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చుంటున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.