కోదాడ, జూన్ 30 : కోదాడ పట్టణంలోని 29వ వార్డులో దశాబ్దాల కాలం నుంచి గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న పేదలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ బుధవారం ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం కూడా గుడిసెల్లో జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యలను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రభు త్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నదన్నారు. అందులో భాగంగా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. తొలుత కాలనీవాసులు ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్కు పటాకులు కాల్చుతూ, స్వాగతం పలికారు. భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, ఆర్డీఓ కిశోర్కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర బాబు, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మ, ఎంపీపీ చింతా కవిత, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల రామారావు, వార్డు కౌన్సిలర్ వంటిపులి రమాశ్రీనివాస్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్తిబాబు, బాబు, నాగరాజు పాల్గొన్నారు.
పాడిపరిశ్రమతో ఆర్థికాభివృద్ధి
చిలుకూరు : పాడి పరిశ్రమపై రైతులు దృష్టి సారిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిలుకూరు గ్రామంలో ఆనంద్ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఆనంద్ పాల సొ సైటీ అభవృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సంఘంలో పాలు ఎక్కువగా విక్రయించిన రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం సంఘం నూతన చైర్మన్గా మంకెన రామారావు , డైరెక్టర్లుగా దొంతగాని నరసింహారావు, కొడారు వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్ కొండా సైదయ్య, ఏపీడీ పెం టయ్య, పశువైద్యాధికారి వీరారెడ్డి, సర్పంచ్ కొడారు బాబు, దొడ్డా సురేశ్బాబు, ఎంపీటీసీ బెల్లంకొండ రమణనాగయ్య పాల్గొన్నారు.
చెక్కు అందజేత
మునగాల: ఆకుపాములలో ఎకనామికల్ రెహిబుల్టేషన్ పథకం ద్వారా మంజూరైన రూ. లక్ష చెక్కును లబ్ధిదారు లక్ష్మికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అందజేశారు. అనంతరం ఒకటో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటలక్ష్మి, సర్పంచ్ కేశగాని వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సైదులు, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు తొగరు రమేశ్ పాల్గొన్నారు.