Mallikarjun Kharge : ఎన్నికల బాండ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ఎన్నికల బాండ్ల నుంచి సొమ్ము చేసుకున్నందుకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిత్యం మోదీ కీ సర్కార్ అంటారని, అందుకే ఈ వ్యవహారంలో ఆయన బాధ్యత వహించాలని కాంగ్రెస్ చీఫ్ స్పష్టం చేశారు.
ఎన్నికల బాండ్ల నుంచి బీజేపీ సొమ్ము చేసుకుందని వెల్లడైందని ఖర్గే పేర్కొన్నారు. ఎస్బీఐ డేటా ప్రకారం విరాళాల్లో 50 శాతం బీజేపీకి, కాంగ్రెస్ బాండ్లు 11 శాతమే ఉన్నాయని తేలింది..ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వారు ఎలా పొందారు..? ఆయా కంపెనీలు అంతటి విరాళాలను కాషాయ పార్టీకి ఎందుకు సమకూర్చాయని ఖర్గే ప్రశ్నించారు.
చాలామంది సందేహాస్పద దాతలు ఉన్నారని విరాళం ఇచ్చిన వ్యక్తులు ఈడీ, ఐటీ కేసుల్లో చిక్కుకున్న వారున్నారని అన్నారు. ప్రధాని మోదీతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు బీజేపీకి అత్యధిక విరాళాలు ఇచ్చాలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఖర్గే ఆరోపించారు.
Read More :
Mahabubabad | మంచి నీళ్ల కోసం రోడ్డెక్కిన జనం