మహబూబాబాద్ : కాంగ్రెస్ పాలనలో సాగు, తాగు నీటి కష్టాలు(Water problem) మళ్లీ మొదలయ్యాయి. నీళ్లు లేక పంటల ఎండిపోవడంతో రైతులు వరి చేన్లకు నిప్పు పెడుతున్నారు. మరోవైపు గుక్కెడు మంచి నీళ్ల కోసం జనం అల్లాడుతున్నారు. తమ గొంతులు తడుపుకునేందుకు రోడ్డెక్కుతున్నారు.
తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలానీల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ CPI (ML) న్యూడె మోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం (Mahabubabad Municipal Offic) ఎదుట మహ ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ రవీందర్ యాదవ్కి వినతిపత్రం అందజేశారు.