న్యూఢిల్లీ: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ ఎర్రకోటపై జెండా ఎగురవేసిన తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అతిథులు అందరూ వచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) హాజరుకాలేదు. ఆయన కుర్చీ ఖాళీగా కనిపించింది. కానీ ఖర్గే తన ట్విట్టర్లో గట్టి సందేశాన్ని ఇచ్చారు. ఓ వీడియో మెసేజ్ చేసిన ఖర్గే.. గత ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దన వైనాన్ని వెల్లడించారు. ఆరోగ్యం సరిగా లేని కారణంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాలేదని చెప్పిన ఖర్గే.. తన మెసేజ్లో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్కు నివాళి అర్పించారు.
భారత దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, నర్సింహారావు, మన్మోహన్ సింగ్, అతల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన మేలు గురించి వివరించారు. ప్రతి ప్రధాని దేశ ప్రగతి కోసం ఎంతో కొంత సహకరించారని, కానీ ఈ రోజుల్లో కొందరు మాత్రం గత కొన్నేళ్లలోనే దేశం ప్రగతి సాధించినట్లు చెబుతున్నారని ఆరోపించారు.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई।
लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है।
हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे।
जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM
— Mallikarjun Kharge (@kharge) August 15, 2023
ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు కొత్త విధానాలను వాడుతున్నారని, సీబీఐ, ఈడీ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని, ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచారని, విపక్ష నోళ్లను మూయిస్తున్నారని, వాళ్ల మైక్లను లాగేసి సస్పెండ్ చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.