Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దేశంపై రుద్దిన నిరుద్యోగమే ప్రధాన అంశమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ గ్యారంటీ నెరవేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లభించక విసిగివేసారుతున్నారని, మన ఐఐటీల్లో 30 శాతం విద్యార్ధులకు ఉద్యోగాలు రాలేదని, 21 ఐఐఎంల్లో కేవలం 20 శాతం ఐఐఎంల్లో మాత్రమే వేసవి ప్లేస్మెంట్స్ పూర్తయ్యాయని ఎక్స్ వేదికగా ఖర్గే పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎంల్లో పరిస్ధితే ఇలా ఉంటే ఇక దేశవ్యాప్తంగా యువత భవిష్యత్ను బీజేపీ ఎలా నాశనం చేసిందో ఊహించవచ్చని అన్నారు. 2014 నుంచి మోదీ హయాంలో యువతలో నిరుద్యోగిత రేటు మూడింతలైందని అన్నారు.
ఇటీవల భారత ఉద్యోగ నివేదిక ప్రకారం ఏటా 70-80 లక్షల మంది శ్రామిక శక్తిలో పాలుపంచుకుంటున్నారని, అయితే 2012, 2019 మధ్య ఉద్యోగాల్లో వృద్ధి కేవలం 0.01 శాతంగా ఉందని అన్నారు. 25 ఏండ్లలోపు ఏదేని డిగ్రీ, డిప్లమా కలిగిన వారు ఏడాదికి కనీసం రూ. లక్ష వేతనంతో కూడిన ఉద్యోగాన్ని డిమాండ్ చేయడం న్యాయపరమైన హక్కని, ఇది కెరీర్ వృద్ధికి నూతన దారులు తెరుచుకుంటాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని మోదీలా తమ పార్టీ తప్పుడు హామీలు ఇవ్వదని అన్నారు.
Read More :