AAP : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఆప్ నేతలు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. నిరాహార దీక్షలో ఆప్ నేతలు, పెద్దసంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
దీక్ష సందర్భంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాం నివాస్ గోయల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతుపలికే వారంతా ఈరోజు నిరాహారదీక్ష చేపడుతున్నారని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయా ప్రభుత్వాలను కూలదోసేవారితో పోరాటం ఆరంభమైందని చెప్పారు. మేం భారత రాజ్యాంగాన్ని కాపాడతామని స్పష్టం చేశారు.
కాషాయ పాలకులు ఆప్ను చీల్చాలని కోరుకుంటున్నా తాము మరింతగా బలపడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులు అరవింద్ కేజ్రీవాల్కు బాసటగా నిలుస్తున్నారని అన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Read More :
Gun misfire | ఓల్డ్సిటీలో గన్ మిస్ఫైర్.. ఆర్ఎస్ఐ బాలేశ్వర్ మృతి