Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో కృష్ణానగర్ స్ధానం నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతానని టీఎంసీ నేత మహువ మొయిత్ర ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది లోక్సభ నుంచి తనను బహిష్కరించే కుట్రతో పాటు ప్రశ్నకు నగదు కేసులో కేంద్ర దర్యాప్తు ఏసజెన్సీలచే దాడులు, సమన్లు జారీ చేసి తన ప్రతిష్టను దెబ్బతీసిన వారికి ఎన్నికల్లో తన విజయం దీటుగా బదులిస్తుందని ఆమె పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఫాసిస్టుల చేతిలో బలికాని గొప్ప దేశంగా భారత్ నిలుస్తుందని ఆమె అన్నారు. సీబీఐ, ఈడీ కాషాయ కూటమి రాజకీయ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆమె మండిపడింది.
కాగా, గత ఏడాది మహువ మొయిత్రను లోక్సభ నుంచి బహిష్కరించిన క్రమంలో టీఎంసీ ఆమెను తిరిగి అదే కృష్ణానగర్ స్ధానం నుంచి బరిలో నిలిపింది. కృష్ణానగర్ నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.
Read More :