జైపూర్ : కాంగ్రెస్ పార్టీపై రాజస్ధాన్ సీఎం, బీజేపీ సీనియర్ నేత భజన్లాల్ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై విశ్వాసం సన్నగిల్లిందని, ఆ పార్టీ పదేపదే అభ్యర్ధులను మార్చేస్తోందని ఆరోపించారు. చిన్నాచితకా పార్టీలతో కాంగ్రెస్ కూటమి కడుతోందని ఎద్దేవా చేశారు. మునిగే నావలాంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాజస్ధాన్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తాను కాషాయ పార్టీలో చేరకుంటే తనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తోసిపుచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, మనీష్ సిసోడియాలకు కోర్టులు బెయిల్ నిరాకరించాయని, అయితే ఆప్ నేతలు మాత్రం బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారని అన్నారు.
బీజేపీతో చేతులు కలిపి కోర్టులు ఇదంతా చేస్తున్నాయని వారు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆప్ నేతల దగ్గర సరైన ఆధారాలుంటే వాటిని చూపి కోర్టులు తమకు ఉపశమనం కలిగించేలా ఎందుకు వారు ప్రయత్నించరని బీజేపీ నేత నిలదీశారు.
Read More :
Mercedes Car: కచోరీ షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురికి గాయాలు.. వీడియో