న్యూఢిల్లీ: ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న ఫేమస్ ఫతే కచోరీ షాపులోకి మెర్సిడీజ్ కారు( Mercedes Car) దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కస్టమర్లతో నిండికుపోయిన కచోరీ షాపులోకి ఒక్కసారిగా కారు దూసుకువచ్చింది. అయితే ఆ సమయంలో కచోరీ తింటున్న కస్టమర్లు ఎటూ కదలలేకపోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. కారు అతివేగంగా రావడంతో.. షాపులో ఉన్న టేబుల్స్ ఎగిరిపడ్డాయి. కొందరు కస్టమర్లు కూడా కిందపడిపోయారు. ఓ గోడను ఢీకొన్న తర్వాత ఆ కారు ఆగింది.
36 ఏళ్ల లాయర్ పరాగ్ మయిని అనే వ్యక్తి ఆ కారును డ్రైవ్ చేస్తున్నాడు. నోయిడా నివాసి అతను. ప్రమాదం స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు కింద అతన్ని అరెస్టు చేశారు. మెర్సిడీజ్ కారును కూడా సీజ్ చేశారు. అయితే డ్రైవర్ మద్యం తీసుకోలేదని గుర్తించారు. కానీ స్టడీ కోసం అతని బ్లడ్ శ్యాంపిల్స్ తీసుకున్నారు. ప్రమాద సమయంలో అతని భార్య కారులోనే ఉన్నది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు.
#WATCH : Cctv footage of a speeding car rams into kachori shop near Rajpur Road, Delhi.#Delhi #SpeedingCar #CarAccident #CCTV #RoadAccident #Accident #DelhiAccident pic.twitter.com/EPgpKPHgOY
— upuknews (@upuknews1) April 2, 2024