ముంబై : మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. పుణెలో బుధవారం ఊపిరాడక నలుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణే శివారులోని కల్భోర్ ప్రాంతంలోని కదమ్ వాక్ వస్తీ వద్ద ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది.
నలుగురు వ్యక్తులు ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు నలుగురు కార్మికులు ట్యాంకులోకి దిగారు. శుభ్రం చేస్తున్న సమయంలో ఊపిరాడక నలుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సెప్టిక్ ట్యాంక్లో నుంచి వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.