Maharashtra BRS | ముంబై, ఆగస్టు 17: శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు. మహారాష్ట్రలో ‘అబ్ కీ బార్.. కిసాన్ సరార్’ నినాదం అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నదని, అందులో భాగమే అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని వంశీధర్రావు పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో శివసేన సంస్థాపక సభ్యుడు రామచంద్ర ఫడవల్ కొడుకు నితిన్ ఫడవల్, ఎన్సీసీ సంస్థాపక సభ్యుడు అబ్దుల్ గణి నవాబ్ షేక్, థానెకు చెందిన రంజీ క్రికెటర్ రవీనా బెలనేకర్, సోమనాథ్ దేశ్ముఖ్, ఫిలిప్ మక్వాన్, రవీంద్ర తివారీ, ఎన్సీ పీ కల్యాణ్ తూర్పు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ ఉత్తర భారత మోర్చా అధ్యక్షుడు మనీష్ ఆర్ మోదీ, బీజేపీ సీనియర్ నేత మోతీలాల్ దూబే, అఫ్రోజా షేక్ సోహెల్, మహమ్మద్ సయీద్, నౌషాద్ కుమార్ఖాన్, అబ్దుల్ గఫా ర్, మంగల్ సుభాష్ సొనావణే, వర్షా రాజేశ్ వల్లే, సమాజ్ వాదీ పార్టీకి చెందిన లతా దుపలే సహా పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొంకణ్ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె, ముంబై సమన్వయకర్త శ్రీనివాస్ సులగే, పార్టీ నేతలు మక్బూల్ఖాన్, జగత్ సింగ్, సంభాజీ కాశిద్ పాల్గొన్నారు.