ముంబై : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చింది. నవంబర్ 14 నుంచి 19 వరకూ వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపడతామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె బుధవారం వెల్లడించారు.
పెట్రో భారాలతో పాటు, ధరల మంట, సామాన్యుడిని ఆర్ధికంగా దిగజారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్పై లీటర్కు రూ 5, డీజిల్పై రూ 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగా ఇది సరిపోదని సామాన్యుడికి ఊరట ఇచ్చేలా సుంకాల్లో భారీ కోత విధించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.