న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.58 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. జోషిమఠ్కు 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపల్కోటి వద్ద భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంప ప్రభావంతో జోషిమఠ్లో భవనాలు స్వల్పంగా కంపియాని అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరగులు తీశారు.
కాగా, భూకంప తీవ్రత భూమి లోపల వచ్చే లోతును బట్టి ఉంటుంది. ఎక్కువ లోతులో భూమి కంపించినట్లయితే తీవ్రత స్వల్పంగా, భూమి పై పొరలలో పలకలు కదిలినట్లయితే తీవ్రత ఎక్కువగా ఉంటుంది.