ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్లోని బాసర్లో మంగళవారం వేకువ జామున 4.29 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. బాసర్కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. వేకువ జామున ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురై, ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు.
అయితే, ఇప్పటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఇదిలా ఉండగా ఈశాన్య భారతంలో ఆది, సోమవారాల్లోనూ భూకంపాలు నమోదయ్యాయి. ఆదివారం, సోమవారం మధ్య రాత్రి 30 నిమిషాల్లో రెండు వరుసగా ప్రకంపనలు వచ్చాయి. కాంగ్పోక్పిలో భూమి కంపించింది. అంతకు ముందు 13న, 4న తామెంగ్లాంగ్, చందేల్ ప్రాంతాలతో సహా మణిపూర్లోని వివిధ ప్రాంతాల్లో మూడు భూకంపాలు సంభవించాయి. 6న అసోంలోని సోనిత్పూర్లో 3.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.