న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం 9.04 గంటలకు ఢిల్లీ-ఎన్సీఆర్తోపాటు దాని సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత 4.4 గా ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని జజ్జర్లో ఉన్నదని తెలిపింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్లలోతులో ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది. భూకంపంతో భయందోళనలకు గురైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.
ఢిల్లీ రాజధాని పరిధిలోని నోయిడా, గజియాబాద్తోపాటు హార్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కూడా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు.
EQ of M: 4.4, On: 10/07/2025 09:04:50 IST, Lat: 28.63 N, Long: 76.68 E, Depth: 10 Km, Location: Jhajjar, Haryana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/uDNjvD8rWT— National Center for Seismology (@NCS_Earthquake) July 10, 2025