భోపాల్: మేఘాలయలో హనీమూన్ సందర్భంగా కొత్తగా పెళ్లైన భర్తను హత్య చేసిన నిందితురాలు సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిషేధించింది. నిందితురాలు లేదా ఇతర వ్యక్తుల దిష్టిబొమ్మలను దహనం చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్తో పెళ్లి జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ హత్య చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
కాగా, దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్తో పాటు భర్తలు, పిల్లలు, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు ఉంటాయని పేర్కొంది.
మరోవైపు సోనమ్ తల్లి సంగీత ఆ సంస్థకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ప్రణయ్ వర్మతో కూడిన సింగిల్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిగింది. అలాంటి దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదని శనివారం తీర్పునిచ్చింది. పిటిషనర్, ఆమె కుమార్తె, కుటుంబం ప్రాథమిక హక్కులను ఇది ఉల్లంఘిస్తుందని పేర్కొంది.
కాగా, ‘భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య ఆమోదయోగ్యం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేరు’ అని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి దిష్టిబొమ్మ దహనం జరగకుండా చూడాలని, మహిళా నిందితులు, వారి కుటుంబాల ప్రతిష్టను దెబ్బతీసే చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను నిరోధించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను హైకోర్టు ఆదేశించింది.
Also Read:
Case On Congress Leader’s Son | ఇద్దరు వ్యక్తులపై దాడి.. కాంగ్రెస్ నేత కుమారుడిపై కేసు
Girl Kidnapped, Raped | బాలికను కిడ్నాప్ చేసి ఆరు నెలలుగా అత్యాచారం.. రక్షించిన పోలీసులు
Watch: మహిళను గాల్లోకి విసిరిన ఎద్దు.. వీడియో వైరల్