భువనేశ్వర్: ఒడిశాలో భారీగా గంజాయి పట్టుబడింది. కోరాపుట్ జిల్లా జాలాపుట్ గ్రామం సమీపంలో మచ్కుంద్ పీఎస్కు చెందిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 1,008 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పనస పండ్ల లోడుతో ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా భారీగా గంజాయి దొరికింది.
పనస పండ్ల కింద ఉన్న బస్తాల్లో గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. గంజాయి బస్తాలను దించి తూకం వేయగా 1,008 కిలోల బరువు తూగాయి. ఆ గంజాయి మొత్తం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్ సహా మొత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
Odisha: Machhkund Police seize 1008 kg of ganja worth around Rs 1 crore near Jalaput village in Koraput
— ANI (@ANI) May 4, 2021
"Police detained a jackfruit-laden truck traveling to Guntur, Andhra Pradesh which carried 1,008 kg of ganja. 3 persons arrested," says Sanjaya Mohapatra, SDPO, Nandapur pic.twitter.com/WJIy9eJ7OC
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెండ్లి నాడే ఎన్నికల్లో గెలుపు.. లక్కీ పెండ్లి కూతురు..!
సిక్కు యువకుడిపై సుత్తితో దాడి.. ఆమెరికాలో దారుణం..!
ఆటోవాలాలకు రూ.5000 చొప్పున ఆర్థిక సాయం
ముగిసిన ఎన్నికలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కూలిన మెట్రో రైలు వంతెన.. 13 మంది దుర్మరణం
జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రకటించిన స్టాలిన్
తిరుమల శ్రీవారి ఆలయంలో విషాదం.. కరోనాతో ప్రధాన అర్చకులు మృతి