న్యూఢిల్లీ: దేశంలో 18 రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం పెరిగాయి. పెట్రోల్పై లీటర్కు 12-15 పైసలు, డీజిల్పై లీటర్కు 15-18 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 90.55కు, డీజిల్ రూ.80.91కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలను చివరిసారి ఏప్రిల్ 15న సవరించారు. అప్పుడు పెట్రోల్ లీటర్కు 16 పైసలు, డీజిల్ 14 పైసలు పెరిగింది. ఇండియాలో రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఇండియాలో లాక్డౌన్లు, కర్ఫ్యూల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్కు డిమాండ్ తక్కువగా ఉంది. అయితే అంతర్జాతీయంగా చూస్తే అటు అమెరికా, యూరప్ దేశాల్లో ఆంక్షలు సడలించడంతో క్రూడాయిల్కు డిమాండ్ పెరుగుతోంది. సోమవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 14 సెంట్లు పెరిగి 67.70 డాలర్లకు చేరగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడాయిల్ ధర కూడా బ్యారెల్కు 14 సెంట్లు పెరిగి 64.63 డాలర్లకు చేరింది.