త్వరలో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలతో చర్చిస్తున్నది. గుజరాత్లోని 26 స్థానాల్లో 24 చోట్ల కాంగ్రెస్, మరో రెండు చోట్ల ఆప్ పోటీ చేయనున్నది. ఆప్కు భరూచ్, భావ్ నగర్ కేటాయించారు. భరూచ్ స్థానం ఆప్కు కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఆప్’తో కుదుర్చుకున్న పొత్తులో భరూచ్ స్థానాన్ని వదులుకున్నందుకు జిల్లా కార్యకర్తలను క్షమాపణ కోరుతున్నారు. అహ్మద్ పటేల్ 45 ఏండ్ల వారసత్వాన్ని మేం వృథా కానివ్వం. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం’ అని ముంతాజ్ పటేల్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
భరూచ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఏడుసార్లు వరుసగా గెలుస్తున్నది. ఈసారి బీజేపీ ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు అహ్మద్ పటేల్ కుటుంబానికి చెందిన ఫైసల్ పటేల్, మంతాజ్ పటేల్లలో ఒకరిని పోటీలో ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ స్థానాన్ని ఆప్కు కేటాయించడంపై ముంతాజ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.