న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు రూ.25.50 పెంచుతున్నట్టు కేంద్ర చమురు సంస్థలు శుక్రవారం ప్రకటించాయి.
తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1795, రూ.1749కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ధరలను పెంచడం వరుసగా ఇది రెండోసారి.