న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా వ్యంగంగా ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వానికి ఫెవరేట్ ఏజెన్సీ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆప్కు ఒక నోటీసు వచ్చిందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. ఈ నోటీసుకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. బీజేపీ మంత్రగత్తె రాజకీయాలను బయటపెడుతానని రాఘవ్ చద్దా తెలిపారు.