జైపూర్: న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందని, కొన్ని కేసులలో న్యాయవాదులే జడ్జీలకు తీర్పును నిర్దేశిస్తున్నారని ఆరోపించారు.
ఎటువంటి ముందస్తు పరిశీలనలు జరుపకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించడం వల్ల వాటి ప్రభ మసకబారుతున్నదని పేర్కొన్నారు. ప్రజలు దీని గురించి ఆలోచించాలని అన్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారమే ఈడీ, సీబీఐ, ఇన్కం టాక్స్ శాఖలు పని చేస్తూ తమ విశ్వసనీయతను కోల్పోతున్నాయని ఆయన విమర్శించారు.