Parliament | మణిపూర్ అల్లర్ల అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం లోక్ సభ (Lok Sabha) ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో గందర గోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభ (Rajya Sabha)లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై చర్చకు విపక్ష నేతలు (opposition members ) పట్టుపడుతున్నారు. ప్రధాని మోదీ రాజ్యసభకు వచ్చి మణిపూర్ అంశంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధానికి ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశాయి. అయితే, వారి డిమాండ్ ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ తిరస్కరించారు. దీంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల నిరసనల మధ్యే ఎగువ సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
Also Read..
Earthquake | అండమాన్ దీవుల్లో భూప్రకంపనలు.. ఐదు రోజుల్లో రెండో ఘటన
Art Director | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ మృతి
Shehbaz Sharif | అన్ని సమస్యల పరిష్కారానికి భారత్ తో చర్చకు సిద్ధం : పాక్ ప్రధాని