న్యూఢిల్లీ, మే 23: ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
ఆరు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 49 సీట్లకు జరిగిన ఐదో విడత ఎన్నికల్లో 8.95 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉండగా, వీరిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.25 కోట్ల మంది స్త్రీలు, 5409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 61.48 శాతం పురుష ఓటర్లతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహిళలు 63 శాతంతో అధికంగా పాల్గొన్నారు. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, లఢక్, ఒడిశా, యూపీలలో పురుషుల కన్నా మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు.