న్యూఢిల్లీ, మార్చి 23: ఎలాంటి చర్చ చేపట్టకుండానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.45 లక్షల కోట్ల బడ్జెట్ను లోక్సభ బుధవారం ఆమోదించింది.
అదానీ అంశంపై విపక్షం, లండన్లో రాహుల్ వ్యాఖ్యలపై అధికార పక్షం సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగకుండానే బడ్జెట్ను ఆమోదించారు. ఈ ప్రక్రియ అంతా కేవలం 12 నిమిషాల్లోనే ముగిసింది.