కోల్కతా : వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ప్రజలుగా మారబోతున్నాయని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. సోమవారం కోల్కతా వచ్చిన బీహార్ సీఎం నితీశ్కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మమతతో భేటీ అయ్యారు.
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ఈ సందర్భంగా వీరి మధ్య చర్చ జరిగింది. అనంతరం మీడియాతో మమత మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో మహాకూటమి ఏర్పాటు విషయంలో ఎలాంటి అభ్యంతరాలు, అహంకారాలు లేవన్నారు. మమతతో భేటీ అనంతరం నితీశ్.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ను కలిశారు.