Lok Sabha Elections : బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్లో, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో పోటీ పడనున్నాయి. జితన్రామ్ మాంఝీ నేతృత్వంలోని అవామీ హిందుస్థాన్ మోర్చా, ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని ఆర్ఎల్ఎమ్ ఒక్కో స్థానంలో బరిలో దిగనున్నాయి. ఈ విషయాన్ని ఏన్డీఏ కూటమి సోమవారం సాయంత్రం వెల్లడించింది.
మూడేళ్ల క్రితం లోక్ జనశక్తి పార్టీని చీల్చి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న పశుపతి పరాస్ వర్గం ఎల్జేపీ ఈసారి ఎన్డీఏ కూటమిలో లేదు. పాశ్వాన్ కమ్యూనిటీలో పట్టు కోల్పోయిన ఆ పార్టీని ఎన్డీఏ దూరం పెట్టింది. బీహార్లో పాశ్వాన్ కమ్యూనిటీకి 6 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం ఆరు శాతం ఓట్లపై చిరాగ్ పాశ్వాన్ వర్గం కమాండ్ సాధించింది.
ఎల్జేపీ కంచుకోట అయిన నవడ లోక్సభ స్థానం నుంచి ఈసారి బీజేపీ పోటీపడనుంది. గయా, కారకట్కు బదులుగా జేడీయూకు షియోహర్ లోక్సభ స్థానం కేటాయించారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న క్రిష్ణగంజ్ లోక్సభ స్థానంలో కూడా జేడీయూ బరిలో దిగనుంది.