న్యూఢిల్లీ : (Venkaiah Naidu) అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉన్నదని, భాష-సంస్కృతుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా రూపొందించిన 100 వ పుస్తకాన్ని న్యూఢిల్లీ నుంచి ఇంటర్నెట్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. 2020 అక్టోబర్ నెలలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (యునైటెడ్ కి౦గ్ డమ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) సంయుక్తంగా నిర్వహించిన 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేయడం పట్ల వెంకయ్యనాయుడు అభినందనలు వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ కృషి ముదావహమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమన్నారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం ప్రతీ ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నానని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమవుతున్నదన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలన్నారు. ఉన్న పదాలను సమర్థంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజు, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు వంశీరామరాజుతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేసీఆర్ మంచి పనులే ‘గెల్లు’ను గెలిపిస్తాయి : టీఆర్ఎస్వీ
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంటా..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..