న్యూఢిల్లీ, ఆగస్టు 17: కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
ఎన్నికల తేదీ వెలువడకముందే, బీజేపీ ఇలా అభ్యర్థుల పేర్లను విడుదల చేయడం ఇదే మొదటిసారి. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 21 స్థానాలకు, 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో 39 స్థానాలకు తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావు దెబ్బతిన్న విషయం తెలిసిందే.