Jungle Safari | గాంధీనగర్: గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలోని జంగిల్ సఫారీ పార్కులోకి చొరబడిన చిరుత ఓ కృష్ణ జింకను చంపగా దీన్ని చూసి భయంతో షాక్కు గురైన మరో ఏడు కృష్ణ జింకలు కూడా మరణించాయి. జవనరి 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై గుజరాత్ అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.
కేవడియా అటవీ డివిజన్ పరిధిలోని పార్కులోకి పటిష్టమైన కంచెను తప్పించుకుని ఓ 2 లేక 3 సంవత్సరాల వయసున్న చిరుత చొరబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహమున్న ప్రదేశానికి సమీపంలో ఈ పార్కు ఉంది. చిరుత పులులు అధికంగా ఉన్న శూల్పనేశ్వర్ అభయారణ్యం దీనికి అత్యంత సమీపంలోనే ఉంది.